బాలుడిపై అత్యాచారం చేసిన వ్య‌క్తికి 20 ఏళ్ల జైలు శిక్ష‌

బాలుడిపై అత్యాచారం చేసిన ఓ కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జ‌రిమానా విధిస్తూ జగిత్యాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. 2019 ఏప్రిల్ 4న జ‌గిత్యాల‌ జిల్లాలోని మల్లాపూర్‌ మండలం సిరిపూర్‌ గ్రామ శివారులో ఓ బాలుడిపై అత్యాచారం జ‌రిగింది. బాలుడిని మామిడి తోటలో కాయలు తెంపేందుకు తీసుకెళ్లిన‌ గోగుల సాయికుమార్ అత‌డిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడు విష‌యాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌గా వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్ప‌టి ఎస్సై సాయికుమార్‌పై కేసు న‌మోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన సీఐ రవికుమార్‌ నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. పూర్తి విచార‌ణ అనంత‌రం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయ‌మూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *