ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్పై ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఏం జరిగినా రెడ్ బుక్ తీస్తా అంటున్నాడని, నా బుక్ తీస్తే నువ్వు , మీ బాబు ఉండరని లోకేశ్కు వార్నింగ్ ఇచ్చాడు. తన పవర్ ఏంటో తెలియాలంటే మీ బాబును అడుగు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎంతో మందిపై దాడులు చేయిస్తున్నాడని, లోకేశ్ను జైలులో పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు జైలుకు వెళ్తాడని ఎప్పుడో చెప్పానని, ఇంకోసారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రాజకీయ నాయకులనైనా ఇబ్బందిపెడితే లోకేశ్, చంద్రబాబులను జైల్లో పెట్టిస్తానన్నారు. అధికారం ఉందని పిచ్చోళ్లలా ప్రవర్తించవద్దన్నారు. లోకేశ్ వైయస్ఆర్ గోటికి కూడా సరిపోవడని, సీఎం చంద్రబాబు సైతం వైయస్ఆర్కు భయపడేవాడని అన్నారు. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్, షర్మిల లాగా కొత్తగ తీన్మార్ మల్లన్న అని చిన్నోడు వచ్చాడన్నారు. ఆయన మీద ఎన్నో రౌడీ కేసులు ఉన్నాయన్నారు. నేను బీసీని అనే ఆర్కెస్ట్రాతో మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య బీసీలను అడ్డుపెట్టుకొని బీసీలను తాకట్టుపెట్టాడన్నారు. అతడి శిష్యుడే తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు నేను ఉన్నాను.. నేను చిరంజీవిలాగా కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ లాగా టీడీపీ, బీజేపీకి అమ్ముడు పోనన్నారు. తనకు ఎంత పెద్ద పదవులు ఇస్తామన్న ఎవరికి అమ్ముడుపోలేదని చెప్పారు.