ఫార్మూలా ఈ కార్ రేసింగ్‌లో అవినీతి జ‌ర‌గ‌లేదు

ఫార్మూలా ఈ కార్ రేసింగ్‌కు సంబంధించి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఏసీబీ కేసు న‌మోదు చేయ‌డంతో పాటు ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ నేత‌లు కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేటీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డ్డాడంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈ కేసుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఈ కేసులో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని తేల్చి చెప్పారు. కేటీఆర్‌పై న‌మోదైన ఈ కేసు దేశంలోనే చెత్త కేసు అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *