ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసులో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధులు తరలించిన అంశంపై అధికారులు కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీఎత్తున తరలివచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.