హైదరాబాద్లో దారుణం జరిగింది. పట్ట పగలు నడిరోడ్డుపై ఓ లాయర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి లాయర్పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై సదరు లాయర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయవాదిగా పని చేస్తున్న ఇజ్రాయిల్ సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఆయన వద్ద దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళ దస్తగిరి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్ను ఆశ్రయించింది. దీంతో ఇజ్రాయిల్ మహిళ తరఫున దస్తగిరిపై ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేసినందుకు కక్ష పెంచుకున్న దస్తగిరి చంపాపేట పరిధి అంబేడ్కర్వాడలో ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేశారు.ఇజ్రాయిల్ను అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.