తెలంగాణలో రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఉగాది సందర్బంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే పలు జిల్లాలో సన్న బియ్యం స్టాక్ లేకపోవడంతో రేషన్ షాపులు మూత పడుతున్నాయి. మరో వైపు కొన్ని రేషన్ షాపుల్లో నేడు ఉదయం నుంచి సర్వర్లు స్తంభించడంతో సరఫరా నిలిచిపోయింది. సివిల్ సప్లై అధికారులకు రేషన్ డీలర్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని సమాచారం. షాపుల ముందు లబ్ధిదారులు బారులు తీరి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండటంతో ప్రజలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.