కోవిడ్ టైంలో సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్కు పంజాబ్లోని లుథియానా కోర్టు షాకిచ్చింది. ఓ చీటింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తన వద్ద మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు తీసుకొని ఇవ్వకుండా మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు. కోర్టులో విచారణకు హాజరు అయ్యేందుకు సోనూసూద్కు ఎన్ని సార్లు సమన్లు పంపినా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు నేడు సోనూసూద్కు అరెస్టు వారెంట్ జారీ చేసింది.