ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాలో మహిళలు పవిత్ర స్నానం చేస్తుండగా ఓ ప్రబుద్ధుడు వీడియోలు చిత్రీకరించాడు. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు విచారణ చేపట్టి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ ఝాగా గుర్తించారు. అమిత్ తో పాటు ఈ వీడియో చిత్రీకరణల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.