ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా, ఆ రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి , పార్టీకి నేడు రాజీనామా చేశారు. దీంతో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్టయ్యింది. అయితే మర్రి రాజశేఖర్ ఏ పార్టీలో చేరతారు, రాజీనామాకు గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. మర్రి రాజశేఖర్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.