నేటి నుంచి ఇంట‌ర్ విద్యార్థుల‌కు మిడ్ డే మీల్స్

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెడుతున్న ఇంట‌ర్ విద్యార్థుల‌కు మిడ్ డే మీల్స్ కార్య‌క్ర‌మం నేడు ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్ల‌డించారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1.48 ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మంత్రి నారా లోకేశ్ నేడు విజయవాడలోని పాయకాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కోసం ప్ర‌భుత్వం ఏటా రూ.85 కోట్లు ఖర్చు చేయనుంది.

మిడ్ డే మీల్స్ మెనూ ఇదే….
* సోమ‌వారం – అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ
* మంగళవారం – అన్నం, పప్పు, గుడ్డు, రసం, రాగిజావ
* బుధవారం – వెజ్‌ పులావ్, ఆలూ కుర్మా, గుడ్డు, చిక్కీ
* గురువారం – అన్నం, సాంబార్, గుడ్డు, రాగిజావ
* శుక్రవారం – పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, గుడ్డు, చిక్కీ
* శనివారం – అన్నం, వెజ్ కర్రీ, రసం, రాగిజావ, పొంగల్‌ స్వీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *