ఏపీలో విద్యుత్ లోటుకు మాజీ సీఎం వైయస్ జగనే కారణం అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారన్నారు. పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు జగన్ కారణం అయ్యారని తెలిపారు.