మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున కుమారుడు, నటుడు నాగచైతన్య, అతడి మాజీ భార్య సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరి విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అంటూ మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం కోర్టును ఆశ్రయించగా సినీ లోకం మంత్రి వ్యాఖ్యలను ఖండించింది.