కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8 లక్షల కోట్ల ఒప్పందాలు చేశామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగిందని గుర్తు చేసుకున్నారు. జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని ఉన్న సంస్థలను వెళ్లగొట్టిందని ఆరోపిపంచారు. వైసీపీ హయాంలో ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు. కూటమి వచ్చాక రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిపి, పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు.