జనసేన పార్టీయే రాష్ట్రానికి భవిష్యత్తు అనే విధంగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన నేతలకు సూచించారు. మార్చి 14న నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో మంత్రి మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదని చెప్పారు. జనసేనలో చాలా మంది పదవులు ఆశిస్తున్నారని, రాజకీయంలో పదవుల కోసమే పని చేయవద్దని సూచించారు. ఆవిర్భావ వేడుకలు పండుగలా జరుపుకోవాలని, సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.