ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చన ఓ ప్రముఖ హామీపై మంత్రి నాదెండ్ల మనోమర్ కీలక ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో దీపావళి పండుగ రోజు నుంచి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 29వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయన్నారు. సిలిండర్ బుక్ చేసుకోగానే సమాచారం ప్రజలకు చేరుతుందని, అనంతరం రెండు రోజుల్లోపు సిలిండర్ అందించననున్నట్లు చెప్పారు. సిలిండర్ వినియోగదారులకు అందిన మరో రెండు రోజుల్లోపు నగదు ఖాతాలో జమ అవుతుందన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తున్నారు.