ఈ మార్చి నెలలోనే డీఎస్సీ పరీక్ష నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతే కాకుండా త్వరలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వమే 1.82 లక్షల పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. అలాగే త్వరలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి గైడ్ లైన్స్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.