ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గ్రామాల వారీగా అధికారులు సర్వేలు చేసి పలు గ్రామాల్లో లబ్ధిదారుల లిస్ట్ పెట్టారు.