రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డయేరియా ప్రబలి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే 14 మంది డయేరియాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితి మామూలుగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. మరో వైపు పంచాయతీ పరిధిలో నాణ్యమైన తాగునీటిని అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.