తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని, కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే ఇస్తామని వెల్లడించారు.
నేడు మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్కు కారణం అవుతోందన్నారు. ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఫంక్షన్లో స్టీల్ వాడాలని సూచించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా స్టీల్ప్లేట్ తీసుకెళ్లి అందులోనే తింటున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.