తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వం కార్మికులకు 2.5 శాతం డీఏను ప్రకటించినట్లు తెలిపారు. డీఏ ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీపై రూ.3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని రేపటి నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.