తెలంగాణలోని లబ్ధిదారులందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలో మంత్రి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. సంక్రాంతికి రైతు భరోసా, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.