మహనీయులకు ఎప్పటికీ మరణం ఉండదని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి తెలుగు దేశం పార్టీ పుట్టిందని వ్యాఖ్యానించారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వాళ్లంతా ఒక్కటేనని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు.