నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కవితపై గతంలో పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, విచారనలో కవిత అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. ఆమె అవినీతిపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగుల కోసం కవిత లంచాలు తీసుకున్నట్లు ఆరోపించారు. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు చేసినట్లు సమాచారం.