బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య , నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.