ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాపై అధికారులు కీలక ప్రకటన చేశారు. నేటికీ కోట్లాది మంది కుంభమేళాకు తరలి వస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు మహాకుంభ్ తేదీలు పొడిగిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర మందర్ మాట్లాడుతూ… ఎన్నో ముహూర్తాలు చూసే ప్రయాగ్ రాజ్లో మహాకుంభ్ తేదీలు నిర్ణయించామని, తేదీలు మార్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికిపైగా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా, ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి ఉత్సవాలతో మహా కుంభమేళా ముగుస్తుందని అధికారులు వెల్లడించారు.