బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో ఎర్రవెల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. నాలుగో రోజు కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమష్టిగా కృషి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.