హైదరాబాద్లో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాధిత యువతికి ఫోటో చూపించగా సదరు యువకుడే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడని యువతి పేర్కొంది. అతడిని మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్గా పోలీసులు గుర్తించారు. మహేశ్ వివాహితుడు. కాగా అతడి వేధింపులు భరించలేక అతడి భార్య ఏడాది క్రితమే అతడిని వదిలి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసై పలు నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులు మహేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.