ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా నారాయణ పేట్ జిల్లాలో ఓ అవినీతి పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. మక్తల్లో ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి సీఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శివరెడ్డి, నరసింహ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేడు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివ రెడ్డి, నరసింహలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.