హైదరాబాద్లో భూ ఆక్రమణ దారులు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల భూముల నుంచి ప్రభుత్వ భూముల వరకు కబ్జాలు చేసేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చంపేందుకు సైతం వెనుకాడట్లేదు. తాజాగా నగరంలో కొందరు భూ కబ్జా దారులు ఏకంగా పోలీస్ డిపార్ట్ మెంట్కు చెందిన భూమినే కబ్జా చేసేశారు. చార్మినార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ శాఖకు చెందిన సుమారు 200 గజాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కబ్జాకు పాల్పడ్డది ఎవరు, వీరి వెనక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.