పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సస్పెన్షన్కు గురైన ఓ ఎస్సై తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎజీఎస్ మూర్తి తణుకు రూరల్ పీఎస్లో కొద్దిరోజుల క్రితం వరకు ఎస్సైగా విధులు నిర్వహించారు. గేదెల అపహరణకు సంబంధించిన కేసులో మూర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన కొద్దిరోజుల నుంచి వీర్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లేందుకు మూర్తి స్టేషన్కు వచ్చారు. కొద్దిసేపు అక్కడే కూర్చొని దిగులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మూర్తి స్టేషన్లోని బాత్రూమ్లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నాడు. పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మూర్తి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మూర్తి సస్పెన్షన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.