విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. పది మంది మహిళలతో పాటు 13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తికి చెందిన ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ ఉన్న బిల్డింగ్లో స్పా సెంటర్ నడిపిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మాచవరం సీఐ ప్రకాశ్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన పది మంది మహిళలతో పాటు, పదమూడు మంది పురుషులను అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ నిర్వాహకుడు భార్గవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.