అశ్రు న‌య‌నాల‌ మ‌ధ్య మ‌న్మోహ‌న్ సింగ్‌కు తుది వీడ్కోలు

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అంత్య క్రియ‌లు ముగిశాయి.ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయ‌న‌కు తుది వీడ్కోలు ప‌లికేందుకు భారీ ఎత్తున రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల మ‌ధ్య మ‌న్మోహ‌న్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. సిక్కు సాంప్ర‌దాయంలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌గా, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌న్మోహ‌న్ పాడె మోశారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, దిల్లీ సీఎం ఆతిశీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *