దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఢిల్లీలోని 70 స్థానాలకు గానూ 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు కేవలం 46.55 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.