అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టించి ఏడాది కావొస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక వీడియో పోస్టు చేసి,ఆయన సందేశాన్ని జోడించారు.” అయోధ్యలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటాల తర్వాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన, గొప్ప రామాలయం అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని సాధించడంలో గొప్ప ప్రేరణగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను…” అని మోదీ పేర్కొన్నారు.