ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో రుద్రాక్షలు చేతబట్టి పుణ్య స్నానం ఆచరించి, గంగా హారతి నిర్వహించారు. బోటులో ప్రయాణించి భక్తులకు అభివాదం చేస్తూ అక్కడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.