గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించనున్నారు. నేడు సోమవారం సాయంత్రం బాలయోగి ఆడిటోరియంలో ప్రముఖ నేతలతో కలిసి మోడీ ఈ మూవీ చూడనున్నారని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేశాయి. అదే ఫిబ్రవరి 27న పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్ప్రెస్కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటనల ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా రూపొందించారు. యంగ్ హీరో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 15న ఇది విడుదలైంది. ప్రధాని మోడీ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.