నేడు పార్ల‌మెంట్‌లో స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ మూవీ!

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాను పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించనున్నారు. నేడు సోమవారం సాయంత్రం బాలయోగి ఆడిటోరియంలో ప్ర‌ముఖ‌ నేతలతో క‌లిసి మోడీ ఈ మూవీ చూడ‌నున్నార‌ని ప‌లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేశాయి. అదే ఫిబ్రవరి 27న పంచమహల్‌ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమా రూపొందించారు. యంగ్ హీరో విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్‌ 15న ఇది విడుదలైంది. ప్ర‌ధాని మోడీ సైతం ఈ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *