అదానీ, మోడీ ఫోటోల‌తో ప్రియాంక బ్యాగ్‌!

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నేడు ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. వ‌య‌నాడ్ ఎంపీ, కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా పార్ల‌మెంట్‌కు తీసుకొచ్చిన బ్యాగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ బ్యాగ్‌పై ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఫోటోలు ఉండట‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదం కూడా ఉంది. ఈ బ్యాగ్‌ను చూసిన ఒక‌రు దాన్ని రాహుల్ గాంధీకి చూపించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో న‌డుస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాహుల్ న‌డ‌క ఆపి మ‌రీ బ్యాగ్‌ను వీక్షించారు. బ్యాగ్‌ను పట్టుకొని ఇది చాలా అందంగా ఉందంటూ ప్రియాంక‌కు చెప్పారు. బ్యాగ్‌కు ముందున్న మోడీ- అదానీల ఫోటో చూసి వెన‌క్కి త‌ప్పి దానిపై ఉన్న నినాదాన్ని చూడి న‌వ్వుతూ అక్క‌డున్న వాళ్ల‌కు ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి అంటూ చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *