బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్ టెక్నాలజీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న వెంకట దత్త సాయిని పీవీ సింధు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి పీవీ సింధు తిరుమలకు వచ్చింది. కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం సింధు దంపతులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందించారు.