కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హన్మకొండ పర్యటన రద్దయింది. ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం నేడు సాయంత్రం రాహుల్ హైదరాబాద్ రావాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన హన్మకొండ వెళ్లాల్సి ఉంది. పార్టీ వర్గాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రాహుల్ రాక కోసం ఏర్పాట్లు సైతం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.అయితే పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా రాహుల్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.