రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం టీంకు కొత్త కెప్టెన్ను ప్రకటించింది. రజత్ పటీదార్ను టీం కెప్టెన్గా నియమిస్తున్నట్లు తెలిపింది. గతంలో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా విరాట్నే కెప్టెన్గా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ రజత్ పటీదార్ను కెప్టెన్గా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల రజత్ పటీదార్ 2021 నుంచి టీంలో ఉన్నాడు.