ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. నవంబర్ 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అనంతరం 19న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక డిసెంబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి.