ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. బండి ఆత్మకూరు మండలం లింగాపూర్ కు చెందిన సుధాకర్ రెడ్డి నారాయణపురంలో ఉన్న తన పొలానికి వెళ్లిన వస్తుండగా మాటు వేసిన ప్రత్యర్థులు కత్తులతో అతడిపై దాడి చేశారు. తలపై కత్తులతో నరకడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజకీయ కక్షలతోనే సుధాకర్ రెడ్డిని చంపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.