– పవన్పై ఎక్స్ వేదికగా రోజా సెటైర్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ పవన్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ అనబడే డిప్యూటీ సీఎం పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్ల పై కాదు… విజయవాడ వరద బాధితుల కోసం, ధర్మం అని అరవాల్సింది నడి రోడ్డు పై కాదు వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం, గొడవ పడాల్సింది మతాల కోసం కాదు.. నీట మునిగి సాయమందని పేదల కోసం అంటూ ఎద్దేవా చేశారు. గుడి మెట్లు కడగడం కాదు, మీ నాయకుల అవినీతిని కడకండంటూ సెటైర్లు వేశారు. ప్రసాదాల కోసం దీక్ష చేయడం మాని రాష్ట్రంలో రాలిపోతున్న చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం దీక్షకు దిగమన్నారు. ఆపసోపాలు పడుతూ కొండలెక్కడం మాని రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను అరికట్టడంపై దృష్టిపెట్టాలన్నారు. దేవుడు పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.