తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్దకు భక్తులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, తమిళనాడుకు చెందిన మెట్టు సేలం, మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల, నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు భారీ ఎత్తున వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.