హైదరాబాద్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య, అత్త వేధింపులతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షేక్ పేటలో ఈ ఘటన జరిగింది. అబ్దుల్ జమిర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గత శనివారం తాను అద్దెకు ఉన్న ఫ్లాట్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆ రోజు అతడి భార్య రెహన్, అత్త ఇంట్లోనే ఉండటం గమనార్హం. జమిర్ సూసైడ్ చేసుకున్నాడని తెలిసిన వెంటనే భార్య, అత్త ఎవరికీ తెలియకుండా అనంతపురానికి వెళ్లారు. సోమవారం అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా జమిర్ విగతజీవిగా కనిపించాడు. జమిర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జమిర్ స్వగ్రామం అనంతపురం పట్టణంలోని కొవ్వూరు నగర్. రెండేళ్ల క్రితం రెహన్ తో వివాహం కాగా, వీరికి ఒక పాప కూడా ఉంది. జమిర్ అత్త, భార్య తరచూ అతడిని వేధిస్తున్నారని స్నేహితులకు చెప్పుకుంటూ బాధపడే వాడని సమాచారం.