రేప‌టి నుంచి ఏపీలో రెవెన్యూ స‌ద‌స్సులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో డిసెంబ‌ర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తార‌ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ స‌ద‌స్సులు వ‌చ్చే ఏడాది జనవరి 8 వరకు జ‌రుగుతాయ‌న్నారు. ఈ స‌మావేశాల‌తో గ్రామస్థాయిలో భూ తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప్రతి మండలంలో ఒక గ్రామంలో రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయ‌ని, చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయని చెప్పారు. తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో, మండల సర్వేయర్ ఈ సమావేశాల్లో పాల్గొంటార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *