బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెనక్కి తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా.. ఆమె మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు.. వాళ్లు ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అసెంబ్లీలో సునీతా లక్ష్మా రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు స్పీకర్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం ఉందని, నాకు ఎనిమిది మంది అక్కాచెల్లెలు ఉన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి చేసినవి కాదని, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నందు వల్ల వినబడలేదని చెప్పినట్లు వెల్లడించారు. సునీతా లక్ష్మారెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందని, మీ మనస్సు బాధ అనిపిస్తే నా మాటలు విత్ డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు.