ఏపీ అసెంబ్లీలో మంత్రులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. మంత్రులు సభకు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో మంత్రి సుభాష్ అందుబాటులో లేరు. దీంతో స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్గా తీసుకోవాలని సూచించారు. సభకు సరైన సమయంలో రావాలని చెప్పారు. డిస్కంల కొనుగోళ్లలో అక్రమాలపై అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కడపలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు. ఆమె విప్గా ఉండటంతో ప్రశ్న అడిగేందుకు అర్హత లేదని చెప్పారు.