నేడు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర, కొమురవెల్లి ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. వేములవాడ ఆలయంలో భక్తులు భారీ ఎత్తున కోడెమొక్కులు చెల్లిస్తున్నారు. శ్రీశైలం, కాళేశ్వరం, వేములవాడల్లో క్యూలైన్లలో భారీ ఎత్తున భక్తులు బారులు తీరారు. దర్శనానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఆయా ఆలయాల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.