తెలంగాణ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములు వేలం వేయడాన్నినిరసిస్తూ హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విద్యార్థులంతా నిరసనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం కంచ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.